సుప్రీంకోర్టులో ఆళ్ళ పిటిషన్ డిస్మిస్
NEWS Aug 14,2026 03:02 pm
రాజధాని అమరావతి విషయంలో జగన్ కి మరో షాక్ తగిలింది. అమరావతి అసైన్మెంట్ భూముల ల్యాండ్ పూలింగ్పై పిటిషన్ కొట్టివేసింది సుప్రీమ్ కోర్టు. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసింది సీజేఐ ధర్మాసనం. అసైన్మెంట్ భూముల స్వాధీనం చేసుకున్న తర్వాతే పూలింగ్ చేశారని ఆళ్ల ఆరోపించారు. కొందరికి లబ్ది చేకూర్చేందుకే ప్రణాళిక ప్రకారం కుట్ర పన్నారని వాదించారు ఆళ్ల. తమకు కావాల్సినవారికి ముందు చెప్పి ఆ తర్వాత పూలింగ్కు వెళ్లారన్నారు మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను గతంలోనే క్వాష్ చేసింది హైకోర్టు. అయితే తన పిటిషన్ ని హైకోర్టు క్వాష్ చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. రాజకీయ కారణాలతో ఇలాంటి అంశాలు లేవనెత్తుతున్నారని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది సుప్రీంకోర్టు. ఆళ్ల దాఖలు చేసిన రెండు పిటిషన్లను డిస్మిస్ చేయడంతో వైసీపీ నేతలకు దిమ్మతిరిగిపోయింది.