జాలరికి చిక్కిన 36 కిలోల చేప!
NEWS Aug 14,2026 10:15 am
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామ శివారులోని వరద కాలువలో నీటి విడుదల నిలిపివేయడంతో మత్స్యకారులు 2 రోజులుగా చేపలు పడుతున్నారు. మత్స్యకారుడు సంపత్ వలకు బుధవారం 20 కిలోల భారీ చేప పడిందని మురిసిపోతుండగా.. తాజాగా గురువారం ఏకంగా 36 కిలోల బొచ్చె చేప చిక్కడంతో ఆనందంతో ఉన్నాడు.