కరీంనగర్ నాకాబందీ.. 82 వాహనాలు సీజ్
NEWS Aug 14,2026 10:15 am
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని 82 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపిన 78 మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, పత్రాలు సరిగా లేకపోవడం వంటి ఉల్లంఘనలకు సంబంధించి రూ.25,700 జరిమానా వసూలు చేసి, దాదాపు రూ.87,000 పెండింగ్ చలాన్లను గుర్తించారు.