16న కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభం
NEWS Aug 14,2026 10:19 am
ములుగు: రాష్ట్రవ్యాప్తంగా వితంతువులు, ఒంటరి మహిళలకు నూతనంగా మంజూరైన పింఛన్ల పంపిణీని ఆగస్టు 16న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మేడారం నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో ములుగు జిల్లాలో పైలాన్ నిర్మాణ పనుల పురోగతితో పాటు నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని మంత్రి పరిశీలించారు. సీఎం పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.