ఇళ్లపై జాతీయ జెండా ఎగరేయాలి
NEWS Aug 14,2026 09:51 am
దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు. హనుమకొండ నగరంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ జెండా దేశ గౌరవం, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.