కుక్కలపై డ్రైవ్కు ఎమ్మెల్యే ఆదేశం
NEWS Aug 14,2026 09:56 am
ఎమ్మిగనూరులో వీధి కుక్కల సమస్యపై ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి స్పందించారు. పట్టణంలోని 2వ వార్డులో ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేసి గాయపరిచిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత చిన్నారులకు అవసరమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వీధి కుక్కల సంచారాన్ని అరికట్టేందుకు వార్డుల వారీగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని మున్సిపల్ కమిషనర్కు స్పష్టం చేశారు. ప్రజలకు, ముఖ్యంగా చిన్నారులకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.