గ్రామపంచాయతీ భూమిలో అక్రమ నిర్మాణం కూల్చివేత
NEWS Aug 14,2026 10:01 am
నర్సాపూర్(జి) మండలం తెంబుర్ని గ్రామంలో గ్రామపంచాయతీ పరిధిలోని భూమిలో అక్రమంగా నిర్మించిన ఇంటిని అధికారులు కూల్చివేశారు. సదరు వ్యక్తికి గ్రామ సర్పంచ్ పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో నిర్మాణాన్ని తొలగించి భూమిని తిరిగి గ్రామపంచాయతీ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్రెడ్డితో పాటు బీడీసీ సభ్యులు పాల్గొన్నారు. పంచాయతీ భూముల్లో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.