అభివృద్ధి, పచ్చదనానికి ప్రాధాన్యం: మేయర్
NEWS Aug 14,2026 09:58 am
కరీంనగర్ నగరపాలక సంస్థ 23వ డివిజన్ సీతారాంపూర్లో సాధారణ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, 17, 18 డివిజన్లలో అమృత్ 2.0 కింద బ్లాక్ ప్లాంటేషన్ ఫెన్సింగ్ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. మౌలిక వసతుల కల్పన, పర్యావరణ పరిరక్షణే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.