అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ
NEWS Aug 14,2026 09:57 am
రాయికల్ మండలం అల్లీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో సీసీ రోడ్డు, కిచెన్ షెడ్డు, మరుగుదొడ్ల నిర్మాణం, ప్రహరీ గోడ, నిర్మాణానికి రూ.16.50, అంగన్వాడీ భవన మరమ్మతులకు రూ.4లక్షలు మంజూరు అయ్యాయన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ గౌతమి వెంకటేష్, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, పాక్స్ ఛైర్మన్ రాజలింగం, ప్రజాప్రతినిధులు, నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.,