తిరుపతి ఎయిర్పోర్టులో త్వరలో ఈ-వీసా సేవలు
NEWS Aug 12,2026 03:47 pm
తిరుపతి వచ్చే విదేశీ భక్తులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. తిరుపతి ఎయిర్పోర్టులో ఈ-వీసా సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ చేరుకుని.. ఈ-వీసా ప్రక్రియ పూర్తి చేసుకుంటున్నారు విదేశీ భక్తులు. ఇక విదేశాల నుంచి నేరుగా తిరుపతి చేరుకోనున్నారు విదేశీ భక్తులు. తిరుపతి చేరుకుని ఈ-వీసా ప్రక్రియ ముగించుకునే సదుపాయం కలగనుంది. దీంతో విదేశీ ప్రయాణికులకు భారీ ఊరట దక్కనుంది. తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ఈ-వీసా ఎంట్రీ పాయింట్ అందుబాటులోకి తెస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది.