గ్రూప్-1 అక్రమాలపై సిట్ రిపోర్ట్ రెడీ
NEWS Aug 12,2026 03:46 pm
వైసీపీ హయాంలో ఏపీలో గ్రూప్-1 మూల్యాంకనంలో అనేక అక్రమాలు జరిగాయి. ఈ అక్రమాలపై సిట్ దర్యాప్తు చేసి రిపోర్ట్ సిద్ధంచేసింది. హైకోర్టుకు సిట్ సమర్పించిన నివేదికలో సంచలన అంశాలు బయటకు వస్తున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ ఆన్సర్ షీట్లు మూడుసార్లు మూల్యాంకనం జరిగినట్లు గుర్తించారు. ఏపీపీఎస్సీ నిబంధనల్లో రీ వాల్యూయేషన్కు అనుమతి లేదు. రీకౌంటింగ్కు మాత్రమే నిబంధనల్లో అవకాశం ఉందని సిట్ పేర్కొంది. విజయవాడలో జరిగిన మాన్యువల్ మూల్యాంకనంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. 21 OMR వాల్యుయేషన్ స్లిప్పుల్లో చేసిన సవరణలకు ఎగ్జామినర్ల సంతకాలు లేవని గుర్తించింది సిట్. అసలు ఎగ్జామినర్ల సంతకాలతో సరిపోలని కొన్ని సంతకాలు దొరికాయి. 57 మంది ఎగ్జామినర్ల జాబితా మూల్యాంకనానికి ముందే లీక్ అయింది.