రోజుకు రూ.4,076 కోట్ల సంపద!
NEWS Aug 12,2026 01:35 pm
దేశంలోని 300 అత్యంత విలువైన వ్యాపార కుటుంబాల సంపద గత రెండేళ్లలో భారీగా పెరిగింది. ‘2026 బార్క్లేస్ హురున్ ఇండియా’ నివేదిక ప్రకారం.. ఈ కుటుంబాల రోజువారీ సగటు సంపద సృష్టి ₹4,076 కోట్లు. రెండేళ్లలో వీరి సంపదకు ₹30 లక్షల కోట్లు జతకావడంతో మొత్తం సంపద ₹138 లక్షల కోట్లకు చేరింది. అగ్ర 10 కుటుంబాల వాటానే 51%. ₹25.82 లక్షల కోట్లతో ముకేశ్ కుటుంబం టాప్లో ఉంది. 300 కుటుంబాలు 54 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ₹56 లక్షల కోట్ల ఆదాయం, ₹5.6 లక్షల కోట్ల నికర లాభం సాధించాయి. తొలి తరం కుటుంబాల్లో ₹19.6 లక్షల కోట్లతో గౌతమ్ అదానీ కుటుంబం ముందంజలో ఉంది.