రాయికల్: ప్రమాదకరంగా సీసీ రోడ్డు
NEWS Aug 12,2026 01:37 pm
రాయికల్ పట్టణంలోని కొమురం భీం చౌరస్తా నుంచి ప్రగతి స్కూల్ వరకు నిర్మించిన సీసీ రోడ్డు ప్రమాదకరంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా మట్టి లెవెల్ లేకపోవడంతో సుమారు రెండు అడుగుల లోతు ఏర్పడింది. దీంతో ఫోర్వీలర్ వాహనం వస్తే ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు కూడా ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఈ మార్గంలో స్కూల్ బస్సులు, ఆటోలు, ఇతర వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి. రద్దీగా ఉండే ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు ఇరువైపులా మట్టి నింపడంతో పాటు దారికి అడ్డుగా ఉన్న ముళ్ల చెట్లు, చెట్ల కొమ్మలను తొలగించాలని కోరుతున్నారు.