అల్లర్లపై కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆగ్రహం
NEWS Aug 12,2026 01:37 pm
కరీంనగర్లో బీఆర్ఎస్, బీజేపీ ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టిస్తున్నాయని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. నగర నడిబొడ్డున కత్తులతో దాడులు చేయడం దారుణమన్నారు. గతంలో కార్పొరేటర్లు కబ్జాలకు పాల్పడితే, ప్రస్తుతం కొందరు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. దాడులకు పాల్పడిన నిందితులను 24 గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. బండి సంజయ్ ఈ ఘటనలను ఖండించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అరాచకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని నరేందర్ రెడ్డి హెచ్చరించారు.