కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
NEWS Aug 11,2026 08:54 pm
పశుసంవర్ధక శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ డాక్టర్ చాహత్ బాజ్పాయి అధికారులను ఆదేశించారు. హనుమకొండ ఐడీఓసీ సమావేశ మందిరంలో పశుసంవర్ధక, పశువైద్య శాఖ కార్యకలాపాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. శాఖల వారీగా అమలు చేస్తున్న కార్యక్రమాలు, వాటి పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన పశుపోషకులకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.