డీజీపీకి టెన్నిస్ టోర్నమెంట్ ఆహ్వానం
NEWS Aug 11,2026 08:12 pm
డీజీపీ సీవీ ఆనంద్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ టెన్నిస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, పాల్వంచ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు వై. వెంకటేశ్వర్లు హైదరాబాద్లో కలిశారు. సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించనున్న ఆల్ ఇండియా సీనియర్స్ టెన్నిస్ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా హాజరుకావాలని డీజీపీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లాలో టెన్నిస్ అభివృద్ధి, యువ క్రీడాకారులకు శిక్షణ, మెరుగైన క్రీడా సదుపాయాల కల్పనపై చర్చించారు.