సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
NEWS Aug 12,2026 10:29 pm
ఈ నెల 16న పరకాల పట్టణానికి CM రేవంత్రెడ్డి రానున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులతో సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా చేపడుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.