73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతు?
NEWS Aug 10,2026 11:20 pm
తెలంగాణలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ SIRలో కీలకమైన ఫారమ్ల స్వీకరణ, డిజిటైజేషన్ గడువు ముగిసింది. రాష్ట్రంలో 3.38 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు సుమారు 2.64 కోట్ల ఫారమ్లు మాత్రమే డిజిటైజ్ అయినట్లు సమాచారం. దీంతో మిగిలిన 73 లక్షలకు పైగా ఓట్లపై ఉత్కంఠ నెలకొంది. తదుపరి దశలో డిజిటైజ్ చేసిన వివరాల ఆధారంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. తర్వాత తుది ఓటర్ల లిస్టును ప్రకటిస్తారు.