గుంటూరులో వైసీపీ నేత దౌర్జన్యం
NEWS Aug 10,2026 03:34 pm
గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ నేత చెన్నకేశవులు రెచ్చిపోయారు. న్యాయవాది ఖాదర్ హుస్సేన్ ఇంటిపై అనుచరులతో కలిసి దాడిచేయడం కలకలం రేపుతోంది. న్యాయవాది ఖాదర్ రోడ్డుపై వెళ్తుండగా చెన్నకేశవులు, ఖాదర్ హుస్సేన్ బైకులు ఎదురెదురుగా వచ్చాయి. వాళ్ళిద్దరి మధ్య మాటామాటా పెరిగి న్యాయవాది ఇంటిపై దాడికి దిగారు చెన్నకేశవులు. తమపై 50 మంది దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు న్యాయవాది. ఇంటి తలుపులు, కిటికీలు, చేతిపంపు ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు.