బాలినేని, దామచర్ల మాటల యుద్ధం
NEWS Aug 10,2026 03:30 pm
కూటమి పక్షాల సమన్వయ కమిటీ టెలికాన్ఫరెన్స్ జరిగింది. ప్రకాశం జిల్లాలో గత రెండురోజులుగా మాజీ మంత్రి బాలినేని, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దీనిపై ఇరుపార్టీల హైకమాండ్స్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆరోపణలు ఉంటే పార్టీ అధినాయకత్వాల దృష్టికి తీసుకురావాలని.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి, దామచర్ల జనార్దన్ కు సమన్వయ కమిటీ సూచించింది. కూటమి ధర్మానికి నష్టం కలిగేలా వ్యవహరించవద్దని ఆదేశాలు జారీచేశారు.