బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలి
NEWS Aug 10,2026 10:34 am
నారాయణపేట జిల్లా ఎక్లాస్పూర్ గ్రామ పాఠశాలలో ఈ నెల 6న 3వ తరగతి విద్యార్థి రంజిత్ పాము కాటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు బాలు, పవన్, నరహరి ఎక్లాస్పూర్లోని రంజిత్ కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని వారు డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.