ఆగస్టు 15 నుంచి తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను విస్తరించనుంది. జెండా పండగను సంక్షేమ పండగగా మార్చుతూ, రెండున్నర లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వనుంది. 3 నుంచి 4 లక్షల మందికి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందించనుంది. అలాగే మహాలక్ష్మి పథకం కింద కొత్తగా 5 లక్షల మందికి గ్యాస్ సిలిండర్ మీద రూ. 500 చొప్పున సబ్సిడీ అందించనుంది.