HYD: పాతబస్తీలోని ప్రసిద్ధ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి 118వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి మంత్రులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఉదయం నుంచి రాత్రి 10:30 గంటల వరకు భక్తులు బోనాలు, ఒడి బియ్యం, చీర, సారెను అమ్మవారికి నివేదిస్తుండగా, సాయంత్రం అమ్మవారి శాంతి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. లాల్ దర్వాజాలోని ప్రధాన ఆలయంతో పాటు పరిసరాల్లోని దాదాపు 3,000 చిన్న దేవాలయాల్లో భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. 5 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటున్నారని అంచనా.