శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో
ఘనంగా బోనాల ఉత్సవాలు
NEWS Aug 09,2026 10:05 am
నిర్మల్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు నెత్తిన బోనాలు ఎత్తుకుని భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. విద్యార్థినీ, విద్యార్థులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాచార్యులు, ఆచార్యులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.