చెక్ బౌన్స్ కేసులో బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డికి చిక్కులు తప్పేలా లేవు. ఆయనకు కోర్ట్ భారీ షాకిచ్చింది. ఈ కేసులో రోహిత్ రెడ్డిని కోర్టు దోషిగా తేల్చింది. రూ.34.23 లక్షల చెక్ జారీ చేయగా.. ఆయన ఖాతాలో నిధులు లేకపోవడంతో చెక్ బౌన్స్ అయింది. ఈ కేసు విషయంలో తన వాదనను నిరూపించడంలో రోహిత్ రెడ్డి విఫలమయ్యారని కోర్టు వ్యాఖ్యానించింది. చెక్ బౌన్స్ కేసులో ఆయన్ను దోషిగా తేల్చింది. తీర్పు వెలువడే సమయంలో రోహిత్ రెడ్డి కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.