మల్లాపూర్: మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన మోత్కూరి రాజేందర్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మొక్కు తీర్చుకున్నారు. ఇందులో భాగంగా తిరుమల కొండపై అలిపిరి మెట్ల మార్గంలో మోకాళ్లపై 101 మెట్లు ఎక్కి తన భక్తిని చాటుకున్నారు. మొక్కు తీర్చుకున్న అనంతరం ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం క్యూలో ఉన్నారు. రాజేందర్ భక్తిశ్రద్ధలతో చేపట్టిన మొక్కు పలువురిని ఆకట్టుకుంది.