గుజరాత్లోని మోర్బి జిల్లా విర్పర్దా గ్రామంలో ఓ బావిలో నీరు సముద్రపు అలల్లా ఉబికి కల్లోలంగా మారడం కలకలం రేపుతోంది. 5 రోజులుగా ఈ వింత కొనసాగుతుండగా, సమీపంలోని ఇతర బావుల్లో మాత్రం నీరు ప్రశాంతంగానే ఉంది. అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. శాస్త్రవేత్తలు, భూగర్భ నిపుణులు ఈ వింతకు కారణాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటన మిస్టరీగా ఉంది.