రోడ్డు లేక ప్రసవ వేదనలో గర్భిణికి నరకయాతన!
NEWS Aug 08,2026 10:18 am
పినపాక మండలం సుందరయ్య నగర్ వలస ఆదివాసి గ్రామంలో రోడ్డు సౌకర్యం లేక గర్భిణికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. 108 అంబులెన్స్ గ్రామానికి చేరుకోలేకపోవడంతో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు గర్భిణిని మంచానికి కట్టి కాలినడకన జానంపేట పీహెచ్సీకి తరలించారు. గ్రామానికి వెంటనే రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరారు.