తెలంగాణలో ఒంటరిగానే బీజేపీ పోటీ
NEWS Aug 07,2026 07:59 pm
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో జనసేనతో సహా ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో జరిగిన సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, 937 మండలాల్లో పార్టీని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అధికారం కోసం రోడ్మ్యాప్ సిద్ధం చేస్తున్నామని, పలువురు కీలక నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.