భూముల రీసర్వే వేగవంతం చేయాలి
NEWS Aug 06,2026 11:14 pm
హనుమకొండ జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని ఇన్చార్జి కలెక్టర్ రవి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో భూముల రీసర్వే పురోగతిపై భూముల కొలతల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూముల సర్వే జరుగుతున్న జిల్లాగా హనుమకొండకు ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొంటూ, రీసర్వే పనులను నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.