స్టూడెంట్స్కు ఫ్రీ ఈ-సైకిళ్లు నిజమేనా?
NEWS Aug 05,2026 07:44 am
ఆధార్ కార్డు ఉన్న విద్యార్థులకు ప్రధాని మోదీ ఉచిత ఎలక్ట్రిక్ సైకిళ్లు ప్రకటించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా నకిలీదని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఆ వీడియోను డిజిటల్గా మార్పులు చేసి రూపొందిం చారని, ప్రధాని అలాంటి ప్రకటన చేయలేదని తెలిపింది. ఈ విషయాన్ని ఆకాశవాణి న్యూస్ కూడా ధృవీకరించింది. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మకుండా, అనుమానాస్పద కంటెంట్ను సంబంధిత అధికారులకు నివేదించాలని PIB సూచించింది.