ఏపీ మద్యం కేసు నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి ఈ నెల 18 వరకు రిమాండ్ విధించింది కోర్ట్. ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. ఏపీ మద్యం కేసులో ఏ-9 నిందితుడిగా ఉన్న ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చాక సిట్ అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.