అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తి
NEWS Aug 05,2026 11:43 am
రాజధాని అమరావతిలో నిర్మాణం అవుతున్న సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్-2, స్టీలు బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తవుతున్నాయి. ఈ రహదారి నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న భూములను భూసేకరణ ద్వారా తీసుకున్న తరువాత యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో 2 వారాల్లోపే సీడ్ యాక్సిస్ రోడ్డు ముఖచిత్రం మారిపోయింది. సీడ్ యాక్సిస్ ఈ-3 రోడ్డు మొత్తం పొడవు 21.78 కి.మీ. కాగా దొండపాడు నుంచి వెంకటపాలెంలోని మంతెన ఆశ్రమం వరకూ ఫేజ్-1 కింద 14.35 కి.మీ. రోడ్డు ఇప్పటికే పూర్తయింది.