'నో ఇన్సూరెన్స్, నో ఫ్యూయల్'
NEWS Aug 05,2026 11:40 am
దేశంలో బీమా లేకుండా తిరుగుతున్న వాహనాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన విక్రయాలను నిరాకరించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు "నో ఇన్సూరెన్స్, నో ఫ్యూయల్" విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ఆదేశించింది.