వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై మరో కేసు
NEWS Aug 04,2026 12:28 pm
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో శనివారం అర్థరాత్రి సాగించిన దమనకాండలో కొత్త కోణాలు, అరాచకాలు బయటపడుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై మరో కేసు నమోదైంది. టీడీపీ నేత వాహనాన్ని ధ్వంసం చేశారు ఎమ్మెల్యే వర్గీయులు దీంతో బాధితుడు ఫిర్యాద చేయడంతో పోలీసులు కేసు పెట్టారు. ఎమ్మెల్యే విరూపాక్షి ఆదేశాలతోనే తన కారుపై దాడి చేశారని.. పోలీసులకు టీడీపీ నేత కొండా పురుషోత్తం ఫిర్యాదు చేశారు.