మత్స్యకారుల అప్రమత్తంగా ఉండాలి
NEWS Jul 30,2026 09:45 pm
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తునందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మత్స్య శాఖ అధికారి అవినాష్ తెలిపారు.. చేపలు పట్టడానికి చెరువులు, రిజర్వాయర్లు కుంటలు, వాగులు, వంటి వాటికి వెళ్ళవద్దని సూచించారు. భారీ వర్షాల వల్ల చేపల వేట నిషేధించడం జరిగిందని ఎవరు కూడా.. చేపలు పట్టడానికి వెళ్లకూడదని సూచించారు.. గోదావరి నది పరివాహక ప్రాంతాల మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.. ఎవరైనా సరదా కోసం చేపల వేటకు చెరువులు రిజర్వాయర్ల వద్దకు వెళ్ళి వరదల్లో చిక్కుకుంటే వారిని రక్షించాలని ఆయన మత్స్యకారులకు కోరారు.