వాగులను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
NEWS Jul 30,2026 07:08 pm
ఇబ్రహీంపట్నం మండలంలో భారీ వర్షాల నేపథ్యంలో యామాపూర్-ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగును కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. వరద ప్రవాహాన్ని పరిశీలించి అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు వాగులను దాటేందుకు ప్రయత్నించవద్దని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.