కార్పొరేషన్ చైర్మన్కు ప్రోటోకాల్ ఎందుకివ్వరు?
NEWS Jul 30,2026 07:07 pm
మెట్పల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కో-ఆప్షన్ సభ్యురాలు షాద్మా రైస్ పలు ప్రజా సమస్యలతో పాటు ప్రోటోకాల్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.ఇటీవల రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన జువ్వాడి నర్సింగరావుకు పట్టణంలో జరిగే అధికారిక సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ వేడుకల సమాచారాన్ని ఎందుకు అందించడం లేదని ఆమె అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వం నియమించిన కార్పొరేషన్ చైర్మన్కు ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సిన గౌరవం, సమాచారం అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆమె పేర్కొన్నారు.