21వ వార్డును సందర్శించిన మున్సిపల్ చైర్మన్, ఎంఆర్ఓ, కౌన్సిలర్ అజీమ్
NEWS Jul 30,2026 07:10 pm
మెట్పల్లి పట్టణంలోని 21వ వార్డులో సీఎంఎస్ గోదాం ఎదురుగా ఉన్న కల్వర్ట్ కుంగిపోవడంతో స్థానికులు సమస్యను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల భద్రత కోసం ముందుగా ప్రమాద సూచికలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ సాధారణ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. మున్సిపల్ చైర్మన్, కమిషనర్, ఎంఆర్ఓ, కౌన్సిలర్ అజీమ్తో పాటు ఇతర కౌన్సిలర్లు, అధికారులు 21వ వార్డును సందర్శించి సమస్య తీవ్రతను పరిశీలించి పరిష్కార చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.