అమరావతి అంటే విజయవాడ, గుంటూరు కూడా
NEWS Jul 28,2026 10:59 pm
రాజధాని అమరావతిని కేవలం 29 గ్రామాల సముదాయంగా మాత్రమే చూడరాదని, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుకొని ఒక బృహత్ ప్రణాళికగా చూడాలని CM చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ 2 నగరాల్లోనూ మౌలిక వసతుల ప్రాజెక్టులను రాజధానికి అనుసంధానంగా అభివృద్ధి చేసినప్పుడే సమగ్ర రాజధాని రూపుదిద్దుకుంటుందని ఆయన అన్నారు. సచివాలయంలో రాజధాని నిర్మాణ పనులపై సీఆర్డీఏ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.