కృష్ణ మండలం ముడుమల గ్రామంలోని వేల ఏళ్ల చారిత్రక ప్రాధాన్యం కలిగిన నిలువరాళ్లను మంత్రి వాకిటి శ్రీహరి సందర్శించడం హర్షణీయమని ప్రపంచాన్ని అబ్బురపరిచే నిలువరాళ్ల చరిత్ర పుస్తక రచయిత కేవీ నరసింహ తెలిపారు. రాష్ట్రంలోని మంత్రులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముడుమలను సందర్శించాలని కోరారు. ప్రపంచంలో అరుదైన ఈ వారసత్వ సంపద తెలంగాణకు గర్వకారణమని, దీనిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.