చెట్టును ఢీకొన్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు... 8 మందికి గాయాలు
NEWS Jul 28,2026 01:52 am
మెట్పల్లిలో తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ప్రమాదం. చెట్టును ఢీ కొట్టిన వరంగల్ 2 డిపోకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు, నిజామాబాద్ నుండి వరంగల్ వెళ్తున్న బస్సులో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 8 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రుల తరలించారు. ఆరుగురిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి.