ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన డీఎస్పీ రాములు
NEWS Jul 28,2026 07:25 am
మెట్పల్లి డీఎస్పీ రాములు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించి పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, రౌడీషీటర్లపై నిరంతరం నిఘా ఉంచి శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ తనిఖీలో మెట్పల్లి సీఐ సురేష్ బాబు, మల్లాపూర్ ఎస్సై అనిల్ పాల్గొన్నారు.