ఆగస్ట్ 1న గీతం డీమ్డ్ టు బి యూనివర్శిటీ 17వ స్నాతకోత్సవం
NEWS Jul 27,2026 12:13 pm
హైదరాబాద్ రుద్రారంలోని గీతం డీమ్డ్ టు బి యూనివర్శిటీ 17వ స్నాతకోత్సవం ఆగస్ట్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తున్నట్టు రిజిస్ట్రార్ డా.డి.గుణశేఖరన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి విఖ్యాత సినీ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. విద్యార్థినీ విద్యార్ధులకు పట్టాలు, గోల్డ్ మెడల్స్ అందించనున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ప్రొ.ఎర్రోల్ డీసౌజా,గీతం అధ్యక్షులు, విశాఖ పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ హాజరవుతారు. మాస్టర్ వీవర్ గజం గోవర్థన కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తారు.