'ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు'
NEWS Jul 27,2026 05:12 pm
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. పెండింగ్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డీఆర్ఓ రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.