'ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేయాలి'
NEWS Jul 27,2026 05:10 pm
బీఎన్ రెడ్డి నగర్ డివిజన్లోని వైదేహినగర్ గ్రంథాలయంలో సర్ కార్యక్రమం కొనసాగుతోంది. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను BLOలు నవనీత, దుర్గాప్రసాద్ నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి తప్పులు జరగకుండా ప్రజలకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపిన వారు తిరిగి తమకు అందజేయాలని కోరుతున్నారు. దానికి సంబంధించి ఏమైనా తప్పొప్పులు, డౌట్స్ ఉంటే ఓటర్ల సమక్షంలోనే నివృత్తి చేస్తామన్నారు.