శ్రీ దుర్గాదేవి ఆలయంలో మహన్యాస రుద్రాభిషేకం
NEWS Jul 27,2026 05:11 pm
ఆషాఢం సందర్భంగా మన్సూరాబాద్ డివిజన్ శ్రీ సాయినగర్ కాలనీలోని శ్రీ దుర్గాదేవి ఆలయంలో మహన్యాస రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం నవచండీ పారాయణం, చండీ హవనం వైభవంగా జరిపారు. మహిళలు, స్థానిక భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించినట్లు ఆలయ ఛైర్మన్ గణేశ్ యాదవ్, అర్చకుడు బాలమురళీకృష్ణ తెలిపారు.