''అందుకే రాజీనామా చేస్తున్నాను''
NEWS Jul 25,2026 09:44 am
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కొనసాగుతున్న వివాదాల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ప్రధాని మోదీకి పంపినట్లు వెల్లడించారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయని రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం పదవిని కొనసాగించాలనే ఉద్దేశం తనకు లేదని, దేశ యువత ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.