ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
NEWS Jul 25,2026 02:43 pm
నీట్ పేపర్ లీక్పై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన్ స్పందిస్తూ.. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నట్లు చెప్పారు. జంతర్ మంతర్ వద్ద చేస్తున్న ధర్నా తీవ్రరూపం దాల్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ ప్రధాన డిమాండ్ అని, అది నెరవేరకపోతే తదుపరి చర్చలకు ఎలాంటి ప్రయోజనమూ లేదని సీజేపీ ప్రకటించింది.