కాల్పుల కేసు ఛేదన.. నలుగురు అరెస్ట్
NEWS Jul 25,2026 11:58 am
మెట్పల్లిలో గత నెల జరిగిన కాల్పుల ఘటనను పోలీసులు ఛేదించారు. ఆస్తి వివాదాల నేపథ్యంలో గోనెల లక్ష్మిని హత్య చేసేందుకు కుట్ర పన్నిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ఎ. రాములు తెలిపారు. ప్రధాన నిందితులు ఉత్తరప్రదేశ్కు చెందిన సచిన్తో సుపారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి నాటు పిస్టల్, 2 బుల్లెట్లు, మోటార్సైకిల్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన దర్యాప్తు బృందాన్ని ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్, డీఎస్పీ ఎ. రాములు అభినందించారు.